సంగారెడ్డి, ఏప్రిల్ 1 : జిల్లా పరిషత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమే దీన్ ద యాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తీ పురస్కారం రావడానికి ముఖ్య కారణమని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిషత్లోని చైర్మన్ చాంబర్లో నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కార్యాలయం నుంచి జారీ చేసిన గ్రామీణాభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన 37అంశాలపై తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పరిషత్ అధికారులు ఫొటోలతో సహా పూర్తి వివరాలను ఆన్లైన్తోపాటు సాధారణ రికార్డులు సమర్పించిన విషయం తెలిసిందే. మరో విశేషం జిల్లా పరిషత్లు 1959లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్కు ఏ అంశాల్లో జిల్లాకు పురస్కారం రాలేదు. కానీ తన పదవీకాలంలో, తెలంగాణ కొత్త రాష్ట్రంలో జిల్లా కేంద్ర అవార్డు రావడం సంతోషంగా ఉన్నది. ఇది అదృష్టంగా భావిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సేవలు, అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలతోనే సాధ్యమైంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు ఆదర్శంగా నిలువడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు.
ఈ నెల 24న ఢిల్లీలో పురస్కారం…
పంచాయతీరాజ్ చట్టానికి శ్రీకారం చుట్టిన రోజు ఈ నెల 24న దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంతి నరేంద్రసింగ్ తోమర్తో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తి పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉన్నది. అవార్డుతోపాటు రూ. 50లక్షల ఇన్సెంటీవ్ రూపంలో నగదు బహుమతి స్వీకరించి జిల్లాలో అత్యవసరమైన మౌలిక సదుపాయాలకు వినియోగించే అవకాశం కలిగింది. జిల్లా పరిషత్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, పౌష్టికాహారం, పిల్లల సంరక్షణ బాధ్యత, ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడంతో కేంద్ర పురస్కారం రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తనకు పదవి ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇచ్చిన పదవిని గౌరవంగా కొనసాగించడం ధర్మం. ముఖ్యమంత్రి సూచించిన మార్గంలో నడుస్తూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం మన కర్తవ్యం.
ఇవీ కూడా చదవండీ..
మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్ చాలా చీప్
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
తమిళనాడులో లాక్డౌన్ పొడగింపు