ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి యజమానిని రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. లక్ష తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితులను రాజీబ్ భట్టాచార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్ కుమార్గా గుర్తించారు. మన్మిత్సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది.