\బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పటికే పలువురు హిందీ నటీనటులకు కరోనా సోకగా, తాజాగా మరో హీరో కరో బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.షూటింగ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు తెలియజేశారు విక్రాంత్. ఆయన ప్రస్తుతం లవ్ హాస్టల్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సోకిందని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. లవ్ హాస్టల్ చిత్రాన్ని శంకర్ రామన్ తెరకెక్కిస్తుండగా, ఇందులో విక్రాంత్ మెస్సీ, సాన్యా మల్హోత్రా, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.