పర్వతగిరి, మార్చి 27 : సాధారణంగా వేసవిలో బావుల్లో నీరు చేదకందని పరిస్థితి ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న కార్యక్రమాలతో భూగర్భజలాలు పైకొచ్చి.. మార్చి నెల ముగుస్తున్నా బావుల్లో చేతికందే నీటితో కనిపిస్తున్నాయి. శనివారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్.. మండలంలోని గోపనపెల్లి, అనంతారం గ్రామాల మధ్యలో ఉన్న ఓ బావిలో చేతికందేలా ఉన్న నీటిని చూసి సంబురపడ్డారు. మండు వేసవిలోనూ చేతికందేలా ఉన్న నీటిని చూస్తే మనసు ఉప్పొంగుతున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ కెనాల్ చివరి భూమి వరకు నీళ్లిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే దక్కుతుందని స్పష్టంచేశారు. సమైక్య పాలనలో సరిగ్గా నాలుగు రోజులు కూడా ఈ కెనాల్లో నీరు పారిన దాఖలాలు లేవని.. స్వరాష్ట్రంలో నిర్విరామంగా నీరు ప్రవహిస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం కండ్ల ముం దు కనిపిస్తున్నదని.. రానున్న రోజుల్లో రైతులు మరిన్ని ఫలాలను చూస్తారని పేర్కొన్నారు.