న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం శనివారం తాజాగా ఆంక్షలు విధించింది. వివాహ వేడుకలకు 200 మందికి మించి అతిథులు హాజరు కారాదని, ఔట్ డోర్ వేడుకలకు 100 మందికి మించి అనుమతించబోమని తెలిపింది.
ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తి అంత్యక్రియలకు 50 మందికి మించి హాజరు కారాదని నిర్ణయించినట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ వెల్లడించారు. ఢిల్లీ విపత్తుల యాజమాన్య సంస్థ చైర్మన్గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ దేవ్ తెలిపారు. ఈ ఆదేశాలు వచ్చే నెలాఖరు వరకు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
వేడుకలు జరిగే హాళ్లలో 50 శాతం వరకు గరిష్ఠంగా, బహిరంగ ప్రదేశాల్లో 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఫేస్మాస్క్లు ధరించి, సామాజిక దూరం పాటించే వారు, థర్మల్ స్కానింగ్ అమలు చేస్తూ, శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటూ కొవిడ్ నిబంధనలు పాటిస్తే, 200 మందిని అనుమతినిస్తున్నట్లు తెలిపారు.
శనివారం కొత్తగా 1,558 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడోరోజు 1500కి పైగా కేసులు రికార్డయ్యాయి. గత డిసెంబర్ 15న నమోదైన 1,617 మంది తర్వాత అత్యధికంగా కరోనా సోకడం ఇదే తొలిసారి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మరణించారు. 75 రోజుల్లో ఇదే అత్యధికం. శుక్రవారం 1,534, గురువారం 1,515 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!