శంషాబాద్/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వీట్ బాక్స్ల్లో దుబాయ్ తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి చిక్కాడు. హైదరాబాద్కు చెందిన మహ్మద్ ముస్తాఫా దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్కు వచ్చాడు. బ్యాగేజ్ చెకింగ్కు వెళ్లే సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ జితేందర్కుమార్ గమనించారు. ఏఎస్సై అజిత్కుమార్యాదవ్ ఆదేశాలతో లగేజీని తనిఖీచేయగా స్వీట్బాక్స్ల్లో విదేశీ కరెన్సీ కనిపించింది. ఆ కరెన్సీ విలువ రూ.1.03 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.