పుణె: టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న ఓపెనర్ జానీ బెయిర్స్టో(94:66బంతుల్లో 6ఫోర్లు, 7సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. సెంచరీకి చేరువగా వచ్చిన బెయిర్స్టో 94 పరుగుల వద్ద శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సాధించాల్సిన రన్రేట్ తక్కువగానే ఉంది. ఇయాన్ మోర్గాన్(20), జోస్ బట్లర్(0) క్రీజులో ఉన్నారు. 23 ఓవర్లకు ఇంగ్లాండ్ 3 వికెట్లకు 171 రన్స్ చేసింది.