న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి సూది ద్వారా ఇచ్చే వ్యాక్సిన్కు బదులు నోటితో క్యాప్సుల్ తీసుకునే తరహాలో మాత్ర రూపంలో వ్యాక్సిన్ అభివృద్ధికి గురుగ్రాంకు చెందిన ప్రేమాస్ బయోటెక్ ఇజ్రాయల్ కంపెనీ అరామెడ్ ఫార్మాస్యూటికల్స్తో చేతులు కలిపింది.
జంతువులపై తమ వ్యాక్సిన్ను ప్రయోగాత్మకంగా పరీక్షించగా కొవిడ్ను నిలువరించే యాంటీబాడీలు వాటిలో తయారయ్యయని వెల్లడైందని ఈ కంపెనీలు తెలిపాయి. అయితే ఈ ఫలితాలను ఇంకా సైంటిఫిక్ పబ్లికేషన్లో ప్రచురించలేదు. ఇవి కేవలం జంతువులపై నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో వెల్లడైన ఫలితాలేనని, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయి. మరో మూడు నెలల తర్వాతే మానవులపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు చేపడతారు.