చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మే 13న మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆచార్య చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు ముఖ్య పాత్ర పోషించారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ..బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే కార్యక్రమానికి హాజరైన సమయంలో పలు వాగ్ధానాలు చేశారు. సోహెల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్గా వస్తానని అన్న మెగాస్టార్… దివి, మెహబూబ్లకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నాడు. అన్నట్టుగానే మెహబూబ్కు ఆచార్యలో కీ రోల్ పోషించే ఛాన్స్ ఇచ్చాడట. మెహబూబ్ ఇందులో జానపద నృత్యకారుడిగా నటిస్తున్నారని.. ఇంటర్వెల్ లో అతని పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఆచార్యలో ఆ పాత్ర ఎమోషన్ ని రగిలించేదిగా ఉంటుందట. ఇప్పటికే మెహబూబ్కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.