హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌరవిద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాంప్రదాయేతర ఇంధన రంగంలో గతంలో 72 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే.. ప్రస్తుతం 4200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. రాబోయే రెండు సంవత్సరాలకు దాదాపు 3 వేల మెగావాట్ల ఉత్పత్తికి వివిధ సంస్థలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ర్టంలో రాబోయే అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. కేవలం తెలంగాణలో 13 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. మరో వెయ్యి మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. విద్యుత్ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో రాష్ర్టానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు.