బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దలాల్ను కొన్ని నెలల క్రితం పరిణయమాడిన సంగతి తెలిసిందే . ముంబైలోని అలీబాగ్లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్లో వీరి పెళ్లి జరగగా, వివాహానికి సంబంధించిన ఫొటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఫుల్ వైరల్ అయ్యాయి. నటాషా దలాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కాగా, వరుణ్, నటాషా స్కూల్ డేస్ నుంచే ఒకరికొకరు పరిచయం. ఆ తరవాత వీరు ప్రేమికులుగా మారారు. ఇటీవల కరీనా కపూర్ ఖాన్ షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో పాల్గొన్నా వరుణ్ ధావన్.. నటాషా దలాల్తో తన ప్రేమ గురించి ఒప్పుకున్నారు.
నటాషా తన ప్రేమను నాలుగు సార్లు రిజెక్ట్ చేసిందని.. మొత్తానికి అంగీకరించి తన జీవితంలోకి అడుగుపెట్టిందని చెప్పిన వరుణ్ ధావన్ తాజాగా తన శ్రీమతి నటాషాతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లారు.సినిమా షూటింగ్లో భాగంగా ఆయన అక్కడకు వెళ్లగా అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ పలు ఫొటోలు దిగారు. అయితే ఇది హనీమూన్ టూర్ కాదంటూ వరుణ్ ధావన్ చెప్పడం కొసమెరుపు.