న్యూఢిల్లీ: టాటా సన్స్ అనుబంధ జువెల్లరీస్ సంస్థ తనిష్క్.. తన వినియోగదారులకు సరికొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల పరిధిలో తమ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి.. పే ఫ్రం హోం సర్వీసును అందుబాటులోకి తీసుకు వచ్చింది తనిష్క్.
ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పే ఫ్రం హోం సేవలను తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన తనిష్క్.. తదుపరి ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నది.
ఇంటి వద్ద నుంచే డబ్బు చెల్లించిన కస్టమర్లకు నేరుగా వారి ఇండ్ల వద్దకే వారు ఎంచుకున్న ఆభరణాలను డెలివరీ చేయనున్నది తనిష్క్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ భారీ స్థాయిలో నగదు తరలింపునకు ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనిష్క్ ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.