హైదరాబాద్ : ఆన్లైన్ మానవ అక్రమ రవాణా రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నగరంలోని కుషాయిగూడ పోలీసులతో కలిసి రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం గురువారం డెకాయి ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నిర్వాహకుడితో పాటు అసోం, పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. నిర్వాహకుడు యూసుఫ్గూడలోని కృష్ణానగర్కు చెందిన ఎం.వంశీ కృష్ణా(25)గా సమాచారం. ఇతడి స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా.
ఎస్ఆర్ నగర్కు చెందిన సాయి అనే మరో నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్లలో ప్రకటనలు(యాడ్స్) పోస్టు చేస్తూ బుకింగ్స్ నిమిత్తం మొబైల్ నంబర్లకు ఆన్లైన్ పేమేంట్స్ ద్వారా డబ్బులు వసూలు చేసేవారు. పోలీసులు వల పన్నీ వంశీకృష్ణతో లోకేషన్ షేర్ చేశారు. చెప్పిన చోటికి వంశీకృష్ణ క్యాబ్లో ఇద్దరు మహిళలతో రావడంతో అందరిని అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణ ఈజీ మనీ కోసం మహిళలను ఈ ముగ్గులోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు.