హైదరాబాద్ : పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బీఎస్ మక్తాలో దారుణం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. యువతి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆమెను నిర్బంధించారు. యువతిని వివస్ర్తగా చేసి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఎస్ మక్తా పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.