అమరావతి : కర్నూల్ జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కరోనా కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని హోంక్వారంటైన్లో ఉంచారు. పాఠశాలలో విద్యార్థినులందరికీ కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైందని తెలిసింది. పాఠశాలలో కరోనా వెలుగు చూడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.