సంగారెడ్డి, సదాశివపేటలో యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించిన మూడు వెంచర్లలో 60శాతం ప్లాట్ల అమ్మకాలు పూర్తయినట్లు సంస్థ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. మియాపూర్లోని యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయాన్ని టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ‘యోషిత’ డైరెక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి, సదాశివపేటలలో మూడు వెంచర్లు ప్రారంభించగా, అతి తక్కువ కాలంలోనే 66శాతం ప్లాట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే మరికొన్ని భారీ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.