తమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్లాట్లు విక్రయిస్తున్నామని శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డి.వెంకట్, నవీన్కుమార్, డి.సునీల్ రెడ్డి ప్రకటించారు. ఈ నాలుగేండ్లలో ఆదిభట్ల, యాదాద్రి, బాచారంలలో వెంచర్లను పూర్తి చేసుకొని, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందామని తెలిపారు. ఇప్పుడు భద్రాచలం హైవేలో శ్రీకౌంటి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లను ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేలా ఈ ప్రాజెక్టులను రూపొందించామన్నారు. పూర్తి స్థాయి అనుమతులతో వెంచర్ ఉన్నదనీ, 250మంది మార్కెటింగ్ బృందంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమను నాలుగేండ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.