బడంగ్పేట్ : బడంగ్పేట్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ ఎస్ పార్టీ నాయకుడు బొర జగన్రెడ్డి, కోఅప్షన్ సభ్యుడు ఖలీల్పాషాలు మంత్రితో పాటు బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్లోని 13వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారిగా చేపట్టి పూర్తిచేస్తామని అన్నారు. ప్రజల సహకారంతో డివిజన్ను అభివృద్ది పరుస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో షేక్మహమ్మద్రఫీ, మంజూర్అహ్మద్, శ్రీకాంత్రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.