బండ్లగూడ : భార్య, బామ్మర్ధుల వెధింపులు భరించ లేక ఓ వ్యక్తి సెల్ఫి వీడియో తీసుకుని ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ జాగీర్ పరిధిలో చంద్రశేఖర్ భార్య ప్రమీల, కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ (36) వృత్తి రీత్య ఫోటోగ్రాఫర్.
కాగా కరోనా నేపథ్యంలో వ్యాపారం సక్రమంగా నడవ కపోవడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. దీంతో అతని భార్య, బామ్మర్థు ల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పని చేతకాదంటూ వేధిస్తున్నారని సెల్ఫి తీసుకుని ఇంట్లో ఉరి వేసుకుని అత్మ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు.