మియాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యథిక జనాభా…ఓటర్లు కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన నియోజకవర్గానికి తాను ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టమని, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల సంపూర్ణ తోడ్పాటుతో రూ.8,126 కోట్ల నిధులతో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం నియోజకవర్గ ప్రగతి నివేదికను ఆయన వెల్లడించారు. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలోనే రహదారులు, తాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, వరద నీటి కాలువలు, డైనేజీ వ్యవస్థ నిర్మాణాలకు రూ. 2,335 కోట్లను వెచ్చించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో అండర్ పాస్లు, ఫ్లె ఓవర్లు, బ్రిడ్జీలు, స్టామ్ వాటర్ డైన్లను రూ. 2,691 కోట్లు, రూ. 404 కోట్లతో ప్రత్యాన్మాయ లింక్ రోడ్లు, రూ.600 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద 800 కిలో మీటర్ల పైప్లైన్,18 భారీ ఓవర్ హెడ్ ట్యాంకులు , 7 ఎస్టీపీలకు రూ. 404 కోట్లు మంజూరయ్యాయన్నారు.
ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులను మంజూరు చేయించు కుంటూ అభివృద్ధి పనులలో ముందుకు సాగుతున్నామన్నారు. ఐటీకి వేదికైన ఈ నియోజకవర్గాన్ని రాబోయే రోజులలో మరింత అభివృద్ధి పథంలో నడిపించటమే తన లక్ష్యమని ఇందుకోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని విప్ గాంధీ స్పష్టం చేశారు.