సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి, పికెట్, కార్కానా, కాకాగూడ, నందమూరినగర్, అన్నానగర్ ప్రాంతాలకు చెందిన పదమూడు మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను బుధవారం వారి ఇండ్ల వద్దకే వెళ్లి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు.
ఈ క్రమంలో లబ్ధిదారుల కుటుంబ సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలు ఘనంగా జిరింపిం చాలనే ఉద్దేశంతో పాటు వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆదే విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్, మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, నేతలు నివేదితా, ముప్పడి మధుకర్, పనస సంతోష్, తదితరులు పాల్గొన్నారు.