సికింద్రాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. పార్టీలకు చెందిన నాయకులు పలు చోట్ల త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆయన నివాసంపై జాతీయ జెండాను అవిష్కరించారు. నామాలగుండులోని పార్టీ కార్యాలయం వద్ద పద్మారావు గౌడ్ కుమారుడు తీగుళ్ల రామేశ్వర్గౌడ్ జెండాను అవిష్కరించారు. వారాసిగూడ చౌరస్తా వద్ద తీగుళ్ల కిరణ్కుమార్ గౌడ్ జెండాను అవిష్కరించారు.