ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లెలగడ్డ గ్రామస్తుల ఆందోళన
హుస్నాబాద్ రూరల్, మార్చి 16 : మండలంలోని జిల్లెలగడ్డ గ్రామంలో రెవెన్యూ అధికారులు ప్రదర్శించిన తీరును నిరసిస్తూ మంగళవారం హుస్నాబాద్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లెలగడ్డ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగడ్డకు చెందిన గుగులోతు రమేశ్ అనే రైతు తన మూడెకరాల పొలం ఎండిపోతుందని ఆందోళన చెంది పొలంలో బోరు వేయించి, మోటర్ బిగించాడు. వాల్టా చట్టం ఉల్లంఘించి బోరు బావి తవ్వించారని పక్క రైతు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే బోరు బావిని సీజ్ చేసేందుకు జిల్లెలగడ్డకు వచ్చారు. ఈ క్రమంలోనే అధికారుల ఎదుట రమేశ్ పురుగుల తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ దవాఖా నకు తరలించారు. అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా బోరుబావిని సీజ్ చేశారని, రమేశ్ పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్సకు తమ వద్ద డబ్బు లేదని కుటుంబీకులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆర్డీవో ఆఫీస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అ డ్డుకున్నారు. ఎస్సై శ్రీధర్ వెం టనే అక్కడికి చేరుకొని కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
తహసీల్దార్ రెహ్మన్ వివరణ ఇస్తూ.. యేడాది క్రితమే రమేశ్ బోరు వేశాడని, పక్క రైతు ఫిర్యాదు చేయగా అతడికి మోటర్ బిగించవద్దని చెప్పామన్నా రు. మళ్లీ ఫిర్యాదు రావడంతో సోమవారం పొలం వ ద్దకు అధికారులు వెళ్లి తనిఖీ చేస్తుండగా తొందరపడి రమేశ్ పురుగుల మందు తాగినట్లు ఆయన చెప్పారు.