కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (35) గురువారం యాకత్పుర – డబీర్పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన గుంటూర్ రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై నలుపు చుక్కలు గల తెలుపు పుల్ చొక్క, బ్రౌన్ రంగు స్వేటర్, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 8106801989లో సంప్రదించాలని కోరారు.