కవాడిగూడ : తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ కమిషనర్గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎ. శరత్ను తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ ట్రిబ్యూనల్ చైర్మన్ బండారు భాస్కర్, సభ్యులు పులిగారి గోవర్ధన్ రెడ్డి, గటికె అజయ్కుమార్లు ఘనంగా సత్కరించారు.
ఈ మేరకు మంగళవారం హిమాయత్నగర్లోని కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మాలలు, షాలువాలతో ఘనంగా సన్మానించినట్లు ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి కవాడిగూడలోని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు.