ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి, గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని చిక్కడపల్లిలో పుట్పాత్పై చేపట్టిన షాపుల షెడ్లను జేసీబీ సహాయంతో తొలగించారు.
అదేవిధంగా ఆర్టీసీక్రాస్ రోడ్, అశోక్నగర్ మార్గంలో అక్రమంగా నిర్మిస్తున్న షాపులను కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ ఏసీపీ జీ.పావని ఆధ్వర్యంలో అధికారులు రాజయ్య, జగన్, అనిల్ తదితరులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని, త్వరలో మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు పావని తెలిపారు.