కాచిగూడ : కర్ణాటక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో యువకుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, ఖరీదైన వస్తువులను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రుద్రారం ప్రాంతానికి చెందిన కె.రాహుల్కుమార్ (20) రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో హౌజ్ కీపర్గా పనిచేస్తున్నాడు.
17న చత్తీస్ఘడ్ నుండి కర్ణాటక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్కు వస్తుండగా మార్గ మధ్యలో రాహుల్కుమార్ బ్యాగులోంచి రూ.12 వందల రూపాయలు, ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలించారు. ఆదివారం రాత్రి కాచిగూడ రైల్వే పోలీసులకు రాహుల్కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నపట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.