బండ్లగూడ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ అన్నారు. శుక్రవారం హిమాయత్సాగర్ గ్రామ నూతన కమిటీ అధ్యక్షులు గూడెపు నర్సింగ్రావు తన కార్యవర్గంతో వెళ్లి ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను ఆయన నివాసంలో కలిసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర మహేందర్ గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షులు గోకరి సురేష్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, యువజన అధ్యక్షులు ఎక్కల్దేవ్ మల్లేష్ యాదవ్, నాయకులు అంతారం నరేష్గౌడ్, అలగాని ప్రవీణ్గౌడ్, గోపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.