కందుకూరు : గడచిన ఇరవై ఏండ్లలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్లు హజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ,కార్యకర్తలు పార్టీకి కొండంత అండఅని పేర్కొన్నారు. పార్టీలో పని చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బాచుపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
బాచుపల్లి అధ్యక్షునిగా దువ్వాసి నర్సింహ, ఉపాధ్యక్షులుగా ఎగిరిశెట్టి చిన్న రాజు, ఇటమోని వెంకటేష్ యాదవ్, ప్రధానకార్యదర్శిగా ఎగిరిశెట్టి జీవణ్, కార్యదర్శులుగా కొంతం లింగారెడ్డి, ఎగిరిశెట్టి బాస్కర్, కోశాధికారిగా ఎగిరిశెట్టి పెద్ద రాజు, కార్యవర్గ సభ్యులుగా కరె అంజయ్య, కుమ్మరి శంకరయ్య, కప్పాటి అంజిరెడ్డి, గుండెలి వెంకటయ్య, దేవోజి పాండురంగాచారి, దేవోజి మాధవాచారి, ఆనేగౌని హరీష్గౌడ్, కాటం దేవేందర్, మహమ్మద్ గౌస్, యూత్ అధ్యక్షునిగా ఎగిరిశెట్టి నరేష్ శాలివాహన, బీసీ సెల్ అధ్యక్షునిగా పగడాల రంగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా మలగల అంజయ్య, మహిళా అధ్యక్షురాలుగా దేవోజు విమళమ్మలు ఎంపికయ్యారు.
కార్యక్రమంలో నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి,చిర సాయిలు, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.