చిక్కడపల్లి :పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, డీఎంసీ హరిక్రిష్ణ, ఏఎంఓహెచ్ హేమలతలతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు రాత్రనక, పగలనకా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు.
ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రధాన్యత ఇస్తుందని తెలిపారు. అందులో భాగంగానే వారికి విలువైన సేఫ్టీ కిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ,పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, పోతుల శ్రీకాంత్, పరుశురాం, రాకేష్ కుమార్, మారిశెట్టి నర్సింగ్,ఆకుల శ్రీనివాస్, శివాసింహ, ఎస్టీ ప్రేమ్, హనుమంతు,సురేశ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.