బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికింద్రాబాద్ బస్టాప్ నుంచి 30 మంది ప్రయాణీకులతో రూట్ నెంబర్ 49లో బస్సు బయలు దేరింది. బస్సు స్టార్ట్ అయిన నిమిషానికే బస్సు డ్రైవర్ రెడ్డి కుడి చేతికి ఉన్నట్టుండి తిమ్మిర్లు రాడవంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మెట్రో పిల్లర్ను ఢీ కొట్టాడు.
బస్సు స్పీడ్ చాలా నెమ్మదిగా ఉండడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. సమీపంలో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్, తోటి సిబ్బంది బస్సు డ్రైవర్ రెడ్డిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు, ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.