చాంద్రాయణగుట్ట : పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్లో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సమీరా అలియా (8), రైయిన్బో పౌండేషన్ ఆశ్రమంలో నివసిస్తూ ఫలక్నుమా బాలికల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో రెండో తరగతి చదువుతుంది. రోజు మాదిరిగానే ఈ నెల 22న ఉదయం 11.30 లకు పాఠశాలకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది.
బాలిక ఎక్కడికి వెళ్లింది అనే విషయం తెలియకపోవడంతో సాయంత్రం వరకు వెతికినా రైయిన్బో పౌండేషన్ నిర్వాహకురాలు సాజీదా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా బాలిక ఆచూకీ తెలిస్తే 7901103985లేదా9491486439 నెంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.కేసును ఎస్సై రాజు దర్యాప్తు చేస్తున్నారు.