మైలార్దేవ్పల్లి : అమ్మవారి వేషదారణతో కళాకారులు ప్రదర్శించిన అధ్యాత్మిక భక్తి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నా యని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం రాత్రి బాబుల్రెడ్డి నగర్లో దేవి శరన్నవరాత్రులలో భాగంగా నవదుర్గా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సాంస్కృతిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పలువురు కళాకారులు శివపార్వతులు, కాళీకాదేవి, పంచముఖి ఆంజనేయులు ,అమ్మవారి వేషధారణ లో అద్భుత నృత్యాలతో భక్తులను అలరించారు. భక్తి గీతాలకు వారు నర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..వివిధ దేవతా వేషదారణలు అద్భుతంగా ఉన్నాయని, ప్రజలకు అమ్మవారి కృపాకటాక్షం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అనంతరం మండప నిర్వాహకులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్ ,శ్రీను, అప్పా,అశోక్ కుమార్ , జగదీష్ అగర్వాల్ ,విఠల్ ,శివక్రిష్ణ,తదితరులు పాల్గొన్నారు.