వనస్థలిపురం : తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర స్ఫూర్తిదాయకమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చింతలకుంటలోని ఆమె విగ్రహాని కి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చేసి న పోరాటం ఆదర్శనీయమన్నారు. మహిళలు ఐలమ్మ చరిత్రను తెలసుకుని, చైతన్యవంతులు కావాలని సూచించారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తోందని తెలిపారు.
జయంతి సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్, కార్పొరేటర్లు రావుల వెంకటేశ్వర్ రెడ్డి, నవజీవన్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, లక్ష్మీప్రసన్న తదితరులు పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ ఐక్యవేదిక అధ్యక్షుడు బాతరాజు నర్సింహ్మా, ప్రధాన కార్యదర్శి చంద్రయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు యాదగిరి, అంజయ్య, కోషాధికారి శ్రీరాములు, వెంకటేష్, సత్యం, బాల్రాజ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.