కందుకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు గుర్తింపు తీసుకవచ్చిందని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలు మతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. గురువారం మండల పరిధిలోని కందుకూరు, దెబ్బడగూడ గ్రామాల్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మ దయవల్ల కరోనా మహామ్మారి రాష్ట్రం నుండి పారిపోవాలని ఆశీంచారు. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగని చెప్పారు. బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులను కేటాయించినట్లు తెలిపారు.
అనంతరం దేవాలయ కమిటీ నాయకులు అనితారెడ్డిని శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్రావణి జంగారెడ్డి, ఎంపీటీసీ ఎల్మటి లక్ష్మీ దేవేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి,టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షులు కొలను విజ్ఞేశ్వర్రెడ్డి,వర్కింగ్ ప్రసిడెంట్ తాళ్ల కార్తీక్,సోషల్ మీడియ కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, కాసోజు ప్రశాంత్చారి, దేశం మోహన్రెడ్డి, పీఎసీఎస్ డైరెక్టరు తీగల జగదీశ్వర్రెడ్డి, ఏనుగు జైపాల్రెడ్డి,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.