చిక్కడపల్లి : అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ లో 4 లక్షల రూపాయల వ్యయంతో, సూర్యనగర్ బస్తీలో మరో 15 లక్షల రూపాయలతో పుట్ పాత్ పనులు శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ రవి చారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. డివిజన్ల వారిగా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాలనీ బస్తీలల్లో కోట్లాది రూపాయిలతో వీడీసీసీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, ఆర్.వివేక్, కోటేశ్వర రావు, జయదేవ్, పి.వి.రాజు, సత్యనారాయణ, ఎంపి. జనార్ధన్, శివ సింహ,నర్సింగ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.