బేగంపేట్ : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని వివిధ ఆలయాలకు రూ.15 కోట్లు విడుదల చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆదర్శనగర్లోని ఎంఎల్ఏ క్వార్టర్స్లో బన్సీలాల్పేట డివిజన్కు చెందిన 11, సనత్నగర్ డివిజన్కు చెందిన 5 దేవాలయాలకు మంజూరైన చెక్కులను మంత్రి ఆయా ఆలయాల నిర్వహాకులు, కమిటీ సభ్యులకు అందించారు.
ప్రశాంత వాతావణంలో బోనాల ఉత్సవాలను జరుపుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.