సికింద్రాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి చెందిన రవి హేలియోస్ ఆసుపత్రి డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్ సహకారంతో లాలాపేట ప్రాంతానికి చెందిన సుదర్శన్కు మూడు చక్రాల మోటార్ బ్యాటరీ వాహనాన్ని ఉచితంగా అందించారు.
సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకోవడం మన అందరి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ విజయ్ భాస్కర్గౌడ్ వివిధ సేవా కార్యకలాపాలను నిర్వర్తిస్తూ సమాజానికి ఉపకరించేలా కృషిచేస్తున్నారని ప్రశంసించారు.