మహేశ్వరం: అనాధపిల్లలను ప్రతి ఒక్కరు అక్కున చేర్చుకొని ఆధరించాలని మహేశ్వరం సీడీపీవో సరిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమీటీ చైర్మన్ నరేందర్రెడ్డి ఆద్వర్యంలో ఆనాధపిల్లలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లతోపాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్ మండలాల నుండి 15 మందికి ఫిట్నెస్ సర్టిఫికెట్లను అందజేసినట్లు ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో వెల్ఫేర్ కమిటీ సభ్యులు విద్యారాణి, దేవేంద్రచారి అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.