సైదాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మలక్పేట సర్కిల్ పరిధిలోని చౌకధరల దుకాణం 133 ను అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరిగ్గా డీలర్ ఇస్తున్నాడా అని క్షేత్రస్థాయిలో తెలుసుకోవటం కోసం అకస్మికంగా తనిఖీలు చేయటం జరుగుతుందని, ఎమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు.
సాంకేతిక ఇబ్బందులతో ప్రజలకు నష్టం కలుగరాదని, ఎమైనా సాంకేతిక సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని ఆయన అధికారులను అదేశించారు. అధికారులు తరుచూ దుకాణాలను తనిఖీలు చేయాలని, అదే విధంగా ఫిర్యాదులను లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదుల బాక్స్లో వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ తనిఖీల్లో మలక్పేట అసిస్టెంట్ సివిల్ అధికారి మల్లికార్జున్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.