శంషాబాద్ : అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్ పరిధిలోని సిద్దులగుట్టపై మంగళవారం దివ్యాలంకారంలో శ్రీ వీరభద్ర స్వామి దర్శనం ఇచ్చారు. ఆలయఅర్చకులు , భక్తులు స్వామివారికి ప్రత్యేకార్చనలు జరిపారు. అభిషేకం, పంచామృత స్నానాలు, పుష్పార్చనలు, భిల్వార్చన పూజలు గావించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మడపతి నరేందర్, మాజీ సర్పంచ్ గణేష్గుప్తా, జెల్ల శ్రీను,వెంకటేశ్, పవన్,శివ,నాగేష్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు