ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠ విభాగంలో శ్రీ ప్రత్యంగిరా దేవి శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని, ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పుష్షాలతో అలంకరించారు. జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి నిర్మించిన ఈ ఆలయంలో మహిమాన్విత అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భాగ్యాలు కలుగుతాయని ఆలయ కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్ తెలిపారు. ప్రతి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రల నుంచి భక్తులు వస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డితోపాటు వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజుశర్మ, విఠల్శర్మ, సాయికుమార్, అరుణ, శ్రీనివాస్రావు, మూర్తి, అనంతశర్మ, ఆర్కేపురం కాలనీ సోసైటీ అధ్యక్షులు రమేష్బాబు, సాయి కుమార్, రామ్మోన్ పాల్గొన్నారు.