సైదాబాద్ : శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సైదాబాద్ పూసలబస్తీలో ప్రసిద్ది చెందిన శ్రీశ్రీపద్మావతీ అలిమేలుమంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఉదయం శ్రీగోపాలస్వామి వారికి అభిషేకం, ఆరాధన, తీర్ధప్రసాద గోష్టి ,ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ ఆర్చకులు వేంకటప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజాలు చేశారు. బస్తీల్లోని వివిధ ప్రాంతాల్లో శ్రీగోపాలస్వామి వారి రధోత్సవ ఊరేగింపు కార్యక్రమం అత్యంతవైభవంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవ ఊరేగింపుకు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.