అమీర్పేట్ : నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పటిష్ఠమైన క్యాడర్ నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టి సారించిం దని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్ఎస్ ప్లీనరీ విజయవం తానికి చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలతో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, సి.హెచ్ మల్లా రెడ్డిలు సమావేశమై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్లీనరీతో పాటు ‘విజయగర్జన’కు నగరాన్ని ముస్తాబు చేసే అంశాలపై చర్చించడం జరిగిందని, త్వరలోనే నగర పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుందని, ఆ విధంగా పార్టీ క్యాడర్తో కలిసి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ సలహాలు సూచనల మేరకు పార్టీని నగరంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ఇకపై శ్రేణులకు శిక్షణా తరగతులు కూడా జరుగుతాయని తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పార్టీ సర్వసభ్య సమావేశాల్లో వచ్చే నెల 15న జరిగే ‘విజయ గర్జన’ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబం ధించి విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నారు.