ముషీరాబాద్ :ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమితులైన త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి కి అభినందన సత్కార సభ సోమవారం గానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, ఓరుగంటి రామకృష్ణ, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశంలు జనార్థనమూర్తిని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వేదిక గానసభను సమర్థవంతగా నిర్వహించడంలో జనార్థనమూర్తి సఫలీకృతమయ్యారని అన్నారు. గానసభలో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, కళలను ప్రొత్సహిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత చొక్కాపు రమణ, డాక్టర్ నాగేశ్వరరావు, కరి సుబ్బిరెడ్డి, మల్లాది హరిశంకర ప్రసాద్, విజయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.