మూడో రోజూ కొనసాగిన క్రికెట్ మ్యాచ్లు
సీఎం కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు పరమేశ్వర్రెడ్డి హాజరు
సిద్దిపేట జోన్, మార్చి 16 : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు సిద్దిపేట జయశంకర్ స్టేడియంలో నిర్వహిస్తున్న టీహెచ్ఆర్ రూరల్ క్రికెట్ ట్రోపీ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి. సీఎం కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు వేముల పరమేశ్వర్రెడ్డితోపాటు సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, చిన్నకోడూ రు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, నంగునూరు మాజీ ఎం పీపీ జాప శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు సోంరెడ్డి, శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, కోల రమేశ్గౌడ్, నాయకుడు పోచబోయిన శ్రీహరియాదవ్, సర్పంచ్లు కొండల్రెడ్డి, బాలయ్య, ఉమేశ్, లింగం, ఉమేశ్చంద్రతోపాటు టీఆర్ఎస్వీ నాయకులు శేఖర్గౌడ్, ప్రశాంత్, పెర్క బాబు, పోశెట్టి శ్రీకాంత్, నార్లపురం రామ్మోహన్, రామరాజు వీక్షించి జట్లకు ఉత్సాహం నింపారు. తన స్వగ్రామమైన బద్దిపడగ జట్టు మ్యాచ్ ఆడుతుండడంతో సీఎం కేసీఆర్ వ్యక్తిగత సహాయకులు పరమేశ్వర్రెడ్డి వారి జట్టును ప్రోత్సహిస్తూ మ్యాచ్ను వీక్షించారు.