శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
ఇందులో 1000 ఆవులకు వసతి కల్పించనున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గోవులకు, మానవాళికి ఎంతో అనుబంధం ఉందని వివరించారు. గో సంరక్షణ మనందరి కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొన్నారు.