మెహిదీపట్నం: హైదరాబాద్ నగరం పరిసరాలలో అయ్యప్ప మాల గురించి తెలియని రోజుల్లో మాల విశిష్టతను వివరిస్తూ ఇప్పటి వరకు వేలాది మంది అయ్యప్ప భక్తులకు మాలధారణ గావించిన అయ్యప్పదాసన్ బైసాని సేతురామన్ గురుస్వామి(85) లంగర్హౌస్ లో శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.ఆయనకు భార్య,ఇద్దరు కుమారులు.
గత 40 ఏండ్లుగా మాల వేసుకుంటున్న ఆయన ప్రతి ఏడాది కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి వస్తుంటారు. లంగర్హౌస్ డిఫెన్స్ కాలనీలో నివసించే బైసాని సేతురామన్ గురుస్వామి గత 40 ఏండ్లుగా లంగర్హౌస్ పరిసర ప్రాంతాలలోనే కాకుండా మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలలో కూడా వేలాది మందిచే అయ్యప్పస్వామి మాలాధారాణ చేయించారు. ఆయనకు వేలాదిమంది శిశ్యులు ఉన్నారు.
ఆదివారం సాయంత్రం ఆయన అంత్య క్రియలు లంగర్హౌస్ సంగం స్మశానవాటికలో అశ్రునయనాలతో ముగిశాయి. ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.