ఉస్మానియా యూనివర్సిటీ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా మారి రాజకీయాలను దిగజార్చుతున్నాడని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. తన కుట్రలను కొనసాగిస్తూ, రాష్ట్ర మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కేటీఆర్పై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ రేవంత్ బ్లాక్మెయిళ్ల సంగతి తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమవుతోందని అన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, రాజకీయాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేటీఆర్ ఉద్యమం చేస్తుంటే, రేవంత్రెడ్డి ఆంధ్రా పార్టీలో ఉండి తెలంగాణ వ్యతిరేక శక్తులకు మద్దతునిచ్చారని గుర్తు చేశారు. దానికి తోడు ఉద్యమకారులను ఏకే 47 తుపాకీతో బెదిరిస్తూ, సీమాంధ్ర దోపిడీదారు లకు కాపలా కుక్కలా పనిచేశారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తి నేడు ఒక ఉద్యమకారుడిపై పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రాష్ట్రంలో ఎక్కడా ఆయనను తిరుగనీయబోమని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఉద్యమ సమయంలో ఓయూలో తరిమికొట్టినట్లుగానే, రానున్న రోజుల్లో మళ్లీ పునరావృతమవుతుందని వివరించారు. ఒక బ్లాక్ పేపర్ వంటి వ్యక్తి, బ్లాక్ మెయిళ్ల రారాజు రేవంత్రెడ్డి వైట్ చాలెంజ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గోడలపై రంగులేసుకునే వ్యక్తి జూబ్లీహిల్స్లో మూడు ఇళ్లు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలుసని అన్నారు. ఇలాంటి వారితో తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన విద్యార్థి నేతలు ఆయన ఇంటివద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే దాడికి పాల్పడడం హేయమన్నారు. తామూ ఆ దాడులు కొనసాగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు జంగం అవినాశ్, కోతి విజయ్, ప్రధాన కార్యదర్శి శిగ వెంకట్, నాయకులు నవీన్గౌడ్, చటారి దశరథ్, కొంపెల్లి నరేశ్, వేల్పుకొండ వెంకట్, మంతెన మధు, జంగయ్య, రమేశ్గౌడ్, రేణు, జగన్, కృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.