శేరిలింగంపల్లి : గుల్మోహార్పార్క్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొరుతూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని బుదవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గుల్మోహార్పార్క్ కాలనీలో మంచినీటి పైపులైన్లు వేసి 27 సంవత్సరాలు అవుతుందని అవీ ఆర్సీసీ పైపులైన్లు కావడంతో నీటి లీకేజీలు అవుతున్నాయని కాలనీవాసులు వాపోయారు.
తద్వారా మంచినీరు కలుషితం అవుతుందని, పాడయిన పాత పైపులైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి వేయాలని కోరారు. కాలనీలోని గ్రంధాలయం అభివృద్దికి నిధులు కేటాయించాలని కాలనీవాసులు విన్నివించారు. దీంతో పాటు కాలనీలో భూగర్బ డ్రైనేజీకి నిదులు కేటాయించినందుకు ఎమ్మెల్యే గాంధీకి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ ఖాసీం, ఉపాధ్యక్షుడు మోహన్రావు, సంయుక్త కార్యదర్శి పెంటాజీ, సలహాదారుడు ప్రసాదరావు తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.